ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ - పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్ 2016)కు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్/ నాన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగాల్లో డిప్లొమా కోర్సులకుగాను ఆంధ్రప్రదేశలోని వివిధ పాలిటెక్నిక్ సంస్థల్లో(ఎయిడెడ్/ అన్ఎయిడెడ్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్స్) ప్రవేశం కల్పిస్తారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు, కంపార్ట్మెంటల్లీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది .
దరఖాస్తు ఫీజు: రూ.330. ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 12.
దరఖాస్తు ఫారం ఫార్మాట్, ఇనస్ట్రక్షన్స్ బుక్లెట్ కోసం sbtetap.gov.in.
ఆనలైన్ అప్లికేషన ప్రక్రియ కోసం sbtetap.gov.in.వెబ్సైట్స్ చూడవచ్చు.
ఏపీ పాలిసెట్ 2016: ఏప్రిల్ 27న జరుగుతుంది.
No comments:
Post a Comment